శంఖవరం మండల కేంద్రంలో కాకినాడజిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లోని ముగ్గుల పోటీల్లో శంఖవరం మండలంలోని
గ్రామ, వార్డు సిచివాయ మహిళా పోలీసులు వేసిన రంగవల్లిక ప్రత్యేక ఆకర్షగా నిలిచింది. పల్లెటూరు వాతావరణం లాంటి సెట్ ముందు ఏర్పాటు చేసిన ఈ
ముగ్గును అచ్చంగా మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, కళాంజలి, గౌతమి, దుర్గ, చిన్నారీలు, నీలిమ, ప్రత్యేకంగా సుమారు 3 గంటల పాటు శ్రమించి వేశారు.
ముగ్గుల పోటీల్లో చాలా ముగ్గులు పోటీ పడినా మహిళా పోలీసులు వేసిన ఈ భారీ ముగ్గు దగ్గరే సంబరాలను తిలకించడానికి వచ్చిన వారంతా సెల్ఫీలు దిగడం
విశేషం. ఈ ప్రత్యేక ముగ్గుని ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, అన్నవరం ఎస్ఐలు పి.శోభన్ కుమార్, అజయ్ బాబులు ప్రత్యేక చొరవ తీసుకొని వేయించారు. ఈ ముగ్గే
అందరినీ మంత్రముగ్దులను చేసింది. ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి వచ్చి తిలకించేలా చేయడం విశేషం..!