వైఎస్సార్సీపీలోకి మరో టిడిపి ఎమ్మెల్యే జంప్..


Ens Balu
1
పశ్చిమ నియోజకవర్గం
2020-09-24 13:20:57

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకి టిడిపి ఎమ్మెల్యేల జంపింగ్ కోసం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సిద్ధంగా వున్నట్టు తెలుస్తోంది. ఇందు ముందుగా విశాఖ పశ్చిమ నియోజ కవర్గ ఎమ్మెల్యే గణబాబు పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు సమాచారం. వచ్చేనెల ఐదున అధికారపార్టీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారట. ఈయన తరువాత తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే, ఆతరువాత ఉత్తర నియోజవర్గ ఎమ్మెల్యే గంటా ఇలా విశాఖ నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పార్టీలోకి చేరతారని విశేషంగా ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో విశాఖ జిల్లా చాలా కీలకంగా వుంది. అలాంటి జిల్లాలో 2019 ఎన్నికల్లో విశాఖ మహానగరంలో ఎంపీ మినహా ఎవరూ పార్టీ నుంచి గెలవలేకపోయారు. ఆ తరువాత ఏడాది దాటిన తరువాత గెలిచిన ఎమ్మెల్యేలంతా యూ టర్న్ తీసుకొని అధికారపార్టీలోకి వచ్చేస్తున్నారు. ముందుగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వచ్చేయగా, ఇపుడు గణబాబు సిద్ధమయ్యారు. అయితే వీరంతా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా అధికారపార్టీకి మద్దతు నిస్తూ, పార్టీలోకి రావడం విశేషం.