విశాఖలో ప్రతిష్టాత్మక జీ-20సదస్సులున్న నేపథ్యంలో నగర సుందరీకరణపై అధికారులు దృష్టి సారించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె బీచ్ రోడ్ లోని వరుణ్ బీచ్ పార్క్ తదితర ప్రాంతాలలో జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, మార్చి నెలలో జి-20 సదస్సు జరుగుతున్నందున నోవాటెల్ హోటల్లో ప్రముఖులు బస చేయనున్న నేపథ్యంలో ఆ ప్రాంత రోడ్లపై జీవీఎంసీ దృష్టి సారించాలన్నారు. తక్షణమే ఆయా ప్రాంతాల్లో మరమ్మతుల తోపాటు పెయింటింగు సుందరీకరణ పనులు చేయించాలని అందుకు అంచనాల తయారు చేసి స్థాయి సంఘం ఆమోదం కొరకు పంపించాలన్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఇంజినీర్ రవికృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.