అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి హుండీల లెక్కింపు ఈనెల27న చేపట్టనున్నట్టు దేవస్థానం అధికారులు
తెలియజేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి హుండీల లెక్కింపు, బ్యాంకులో నగదు
జమ జరుగుతుందని పేర్కొన్నారు. దానికోసం పరకామణి సిబ్బందిని ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొ్న్నారు. ఆరోజు ఉదయం 7.30 గంటల నుంచి
లెక్కింపు ఆలయ ఈఓ, చైర్మన్, ఇతర సభ్యులు, దేవస్థాన సిబ్బంది సమక్షంలో జరుగుతుందని తెలియజేశారు.