28 నుంచి ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం


Ens Balu
12
Visakhapatnam
2023-01-24 12:03:48

విశాఖపట్నం నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు 14వ ట్రైబల్ యూత్ ఎక్సైజ్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ జి మహేశ్వరరావు, సర్వ శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు ఋషికొండలోని ట్రైబల్ కల్చరల్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్ భవనంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు