కాకినాడ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శంఖవరం గ్రామ సచివాలయం-1 సర్వేయర్ వీర్ల సురేష్ ఉత్తమ అవార్డు అందుకున్నారు. జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, జెసి ఇలాక్కియా, జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు చేతుల మీదుగా సురేష్ ఈ అవార్డును స్వీకరించారు. సురేష్ కి ఉత్తమ అవార్డు రావడం పట్ల సచివాలయ కార్యదర్శి రామచంద్రమూర్తి, జేఏబీసీ రమణమూర్తి, సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్.శిరీష, వీఆర్వో సీతారాం, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్ లు శుభాకాంక్షలు తెలియజేశారు.