శుభకృత్ రథసప్తమి నుండి మే15వరకు 108 రోజులు గోవిందమాలతో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దీక్షను చేపట్టినట్టు భ్రీ భోగిగణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలియజేశారు. ఈ మేరకు ఆయన కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. దీక్ష పూర్తయిన వెంటనే స్వయంభు కాకినాడ శ్రీభోగివిఘ్నేశ్వర స్వామి వారి పీఠం నుండి స్వయంభు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొండకు కాలినడకన పాదయాత్ర కూడా చేపట్టనున్నట్టు ఆయన వివిరంచారు. స్వామివారి మాలధారణ సమయంలో ఆలయంలో అన్ని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టనన్నట్టు ఆయన వివరించారు.