క్రైస్తవ మతాన్ని వీడి హిందుత్వాన్ని స్వీకరించిన గిరిజనులు


Ens Balu
20
Koyyuru
2023-01-28 16:34:43

అల్లూరి సీతారామరాజు జిల్లాలో క్రమేపీ హిందూమతం పట్ల గిరిజనులు ఆకర్షితులు అవుతున్నారు. గత కొద్ది రోజులు క్రైస్తవ మతాన్ని వదిలి పెట్టి హిందూమతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొయ్యూరు మండలం, రేవళ్లు కంటారం గ్రామంలో క్రైస్తవ మతం వీడి 40 మంది హిందూ మతం స్వీకరించారు. గిరిజన ప్రాంతంలో గిరిజనులు స్థానిక సంస్కృతులు మరిచి క్రైస్తవ మత సేకరణతో సాంప్రదాయాలు మరువడంతో సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంప్రదాయాలను అనుసరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉత్తేజితులైన  గిరిజనులు తమ హిందూ మతం వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ సందర్భంగా మంత్రోచ్చరణల నడుమ హోమం నిర్వహించి హిందూమత స్వీకరణ కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు. ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది.
సిఫార్సు