సింహాచలం ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త విజినిగిరి బాలభానుమూర్తి అనాధశరణాలయంలోని బాలికలకు ఆదివారం నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.ఈ
సందర్భగా ఆయన మాట్లాడుతూ, నిరంతర ఉచిత దుస్తులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసనగర్ లోని మనసు బాలికల అనాధ ఆశ్రమంలో ఈ పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. ప్రార్ధించే పెదవుల కన్నా..సాయం చేసే చేతులు మిన్న అన్న అని భావిస్తూ..తనపరిధిలో ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నా అనేవారు లేని నిర్భాగ్యులకు సహాయం చేయడానికి మరింత మంది దాతలు మంచి మనసుతో ముందుకి రావాలని ఆయన కోరారు.