మండపంలో 55 మందికి వైద్య పరీక్షలు..


Ens Balu
1
మండపం
2020-09-24 19:40:45

శంఖవరం మండలంలోని మండపం రామాలయంలో గురువారం డా.అభిషేక్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు గ్రామంలో 55 మంది వృద్ధులు వికలాం గులు,మహిళల కు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. సచివాలయ ఏఎన్ఎమ్ సుష్మా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని  గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు జ్వరం ,మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కూనిశెట్టి మాణిక్యం , కార్యదర్శి పి నాగమణి ,మహిళా పోలీస్ గౌతమి ,మాజీ సర్పంచ్ నక్కా మాణిక్యం ,ఏఎన్ఎమ్ కృష్ణ కుమారి,అల్లు బాబు ,ఆశా నాగమణి ,విహెచ్ఏ శ్యామ్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.