సింహాద్రి అప్పన్నకు అయ్యన్న ప్రత్యేక పూజలు


Ens Balu
21
Simhachalam
2023-02-03 11:29:45

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని టిడిపి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభము ఆలింగనం తదుపరి స్వామి వారి దర్శనం అనంతరము వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించారు. ఆలయ ఇన్స్పెక్టర్ కనకరాజు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అయ్యన్నతోపాటు చోడవరం మాజీ ఎమ్మెల్యే రాజు, సింహాచలానికి చెందిన పలువులు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సిఫార్సు