ఇవిఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. షట్టర్లకు వేసిన, తాళాలను, సీళ్లను పరిశీలించారు. క్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. తనిఖీల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, నెల్లిమర్ల తాసిల్డార్ రమణ రాజు, ఎంపిడిఓ జి.గిరిబాల, మున్సిపల్ కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్, ఎన్నికల విభాగం సూపరింటిండెంట్ నీలకంఠ రావు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.