గిరిజనులకు రగ్గులు పంపిణీ చేసిన సీఆర్పిఎఫ్ జవాన్లు


Ens Balu
20
ముంచింగుపుట్టు
2023-02-04 10:40:14

అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం దారపల్లి గ్రామంలో శనివారం సిఆర్పిఎఫ్ 198బెటాలియన్ జవాన్లు130 మంది గిరిజనులకు చలి రగ్గులను పంపిణీ చేశారు. సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్ మాట్లాడుతూ,  ప్రతి సంవత్సరం మాదిరిగా ఈఏడాది కూడా గిరిజనులకు చలి రగ్గులును పంపిణీ చేసినట్టు చెప్పారు. సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా గతంలో రేడియోలు, గొడుగులు సైతం పంపిణీ చేశామన్నారు. యువత అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా.. సంఘవిద్రసక్తులకు దూరంగా ఉండి.. కేంద్ర ప్రభుత్వ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు యువత ముందుకి రావాలన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ సిబ్బంది, ఏఎస్ఐ తిరుపతి, స్థానిక సర్పంచ్ సుభాష్ చంద్ర, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సిఫార్సు