విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి(సింహాద్రి అప్పన్న)వారి నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు కె.కోటపాడు రొంగలి నాయుడుపాలెంకు చెందిన కొల్లి శివప్రసాద్, కృష్ణమ్మ దంపతులు సోమవారం రూ:101.116/- నగదు రూపంలో విరాళం ఇచ్చారు. ఆ మొత్తాన్ని ఆలయ ఇన్స్పెక్టర్ సిరిపరపు కనకరాజుకి ఆలయంలో అందజేశారు. అనంతరం దాతలు అంతరాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దాతలకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, సిబ్బంది వారికి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.