సత్యదేవుని సన్నిధిలో పాలకవర్గ ప్రమాణస్వీకారం


Ens Balu
19
Annavaram
2023-02-09 08:42:40

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కొత్త పాలకమండలి గురువారం  కొలువు తీరింది.  14 మంది సభ్యులతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేసింది. వీరంతా స్వామివారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త పాలకమండలిలో ధర్మకర్త కుటుంబ సభ్యులు  ఐవీ.రోహిత్ చైర్మన్ గా మరో 13 మంది సభ్యులుగా ఉంటారు. ఈసారి పాలకమండలిలో ఐదుగురు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కార్యక్రమం అనంతరం వీరంతా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  కొత్త పాలకమండలి ఏర్పడడంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పనకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, దేవస్థానం అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తామని సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో దేవస్థాన ఈఓ మూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు