జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించడం జరిగిందని శంఖవరం మండల విద్యాశాఖ అధికారి ఎస్వీరమణ తెలియజేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం నవోదయకు గడువుపెంచినందున.. ఆసక్తి గల విద్యార్ధిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు తమ పాఠశాల పిల్లలను ప్రోత్సాహించి నవోదయ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే విధంగా చూడాలన్నారు.