వంజరి గ్రామంలో ఇదేం కర్మ-మన రాష్ట్రానికి


Ens Balu
21
G.Madugula
2023-02-10 06:18:42

పాడేరు నియోజకవర్గం జి.మాడుగుల మండలం వంజరి గ్రామంలో  ఇదేం కర్మ - మన రాష్ట్రానికి కార్యక్రమం మాజీ మంత్రి మత్యరాస మణి కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింద న్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ యం వి వి ప్రసాద్ మాట్లాడుతూ, యువతకు ఉద్యోగాలు లేవని, కూలీలకు పనులు కూడా లేకుండా చేసిన ఘనత వైఎస్సార్సీపీ పార్టీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇంటింటికీ తిరిగి వైఎస్సార్సీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో  టిడిపి రాష్ట్ర కార్యదర్శి  బొర్రా నాగరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వంజంగి కాంతమ్మ, జిల్లా మాజీ అధికార ప్రతినిధి కొట్టగుళ్ళి సుబ్బారావు , మహిళా ప్రధాన కార్యదర్శి  బొర్రా విజయరాణి , బొడ్డేటి వరలక్ష్మీ, ఉల్లి లక్ష్మయ్య, పొత్తురు రామారావు, శ్యాం సుందర్, చిరంజీవి, పరశ్ రాము  అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


సిఫార్సు