ప్రతీ ఒక్కరూ దిశయాప్ ఇనిస్టాల్స్ కి ముందుకి రావాలి


Ens Balu
10
Sankhavaram
2023-02-11 13:30:20

సైబర్ నేరాలపై పాఠశాల విద్యార్ధులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని గ్రామసచివాలయ మహిళాపోలీస్ జిఎన్ఎస్.శిరీష సూచించారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ హైస్కూలులోని విద్యార్ధులకు సైబర్ నేరాలు, వాటి రకాలు, తీసుకోవాల్సిన జగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్ధులు ముఖ్యంగా ఆన్లైన్ లో డబ్బులుపెట్టి ఆడేఆటలకు దూరంగా ఉండాలన్నారు. ఆసమయంలో వచ్చే ఫోన్ చేసి మాట్లాడేవారికి ఓటీపీలు, బ్యాంకు ఖాతాల నెంబర్లు, ఆధార్ నెంబర్లు చెప్పకూడదన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేసి లక్కీడిప్ లో ప్రైజులు వచ్చాయని చెప్పే కల్లబొల్లి మాటల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా గుచ్చి గుచ్చి అడిగినా ఎందుకు సమాధానం చెప్పాలని గట్టిగా గద్దించాలని, లేదంటే ఈనెంబరుతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని దైర్యంగా  చెప్పాలన్నారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా విద్యార్ధులే తెలిసేలా చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.
సిఫార్సు