ఏపీలో పోలీసులు YSRCPమాన్యువల్ వాడుతున్నారు


Ens Balu
7
Visakhapatnam
2023-02-17 13:40:03

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు అధికారిక మాన్యువల్ ను పక్కనపెట్టి వైఎస్సార్సీపీ మాన్యువల్ ను వాడుతున్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. అధికారాన్ని పోలీసులను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ప్రతిపక్షాల సభలను అడ్డుకోవడం చేతగానితన మన్నారు.  తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే చంద్రబాబు సభలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేరశారు. ఢిల్లీ నే ఎదిరించిన దమ్మున్న నాయకుడు అని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ధైర్యం చంద్రబాబును ని చూసి ఎటు పోతుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడి సభలకు రక్షణ కల్పించలేని చేతగాని ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం జగన్ పాదయాత్రకు ఆటంకం కలిగిస్తే నేడు అధికారంలోకి వచ్చేవాడా? అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుచేసుకొని చేస్తున్న చేతకాని పనులను ఆపాలన్నారు.

సిఫార్సు