శివరాత్రి రోజు పరమశివుని దర్శనం ముక్తిదాయకం


Ens Balu
10
Ramakrishna Beach
2023-02-18 07:22:39

లోకానికి వెలుగులు నింపే ఆ పరమశివుడిని శివరాత్రి రోజు దర్శించుకుంటే అంతకు మించిన ముక్తి దాయకం మరొకటి ఉండదని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం బీచ్ రోడ్ లో డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి సేవా పీఠం ఏర్పాటు చేసిన  కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీనుబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులతో కలిసి స్వయంగా శివలింగానికి వీరు అభిషేకం నిర్వహించా రు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా బీచ్ రోడ్ లో కోటి శివలింగాలని ఏర్పాటు చేసి భక్తులు దర్శించుకునే అవకాశం కల్పించడం, ప్రత్యేక తీర్థ మహోత్సవం ఏర్పాటు ,సాయంత్రం సాంస్కృతికార్యక్రమాల నిర్వహన ప్రశంసనీయమన్నారు.

సిఫార్సు