కాకినాడ బర్మా కాలనీలో "జ్యోతిర్లింగార్చన"


Ens Balu
7
Kakinada
2023-02-18 14:18:02

కాకినాడ ఆర్ టి సి కాంప్లెక్స్ వెనుక వున్న బర్మా కాందిశీకుల కాలనీలో గణేశ మందిరం వద్ద  శనివారం రాత్రి జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. కోలా ఎల్లారావు ఆధ్వర్యం లో జరిగిన కార్యక్రమం నందు భోగిగణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దీపపు జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధిస్తూ చేపట్టే సమైక్య జ్యోతిర్లింగార్చన  వలన సమతా భావం ఏర్పడుతుందన్నారు. లోకకల్యాణం సిద్ధించే మహాశివరాత్రి లయ బద్దమైన సృష్టి ప్రగతికి నాందిగా భక్తులు  విశ్వసిస్తారన్నారు.
సిఫార్సు