భక్తితో పాదయాత్ర చేస్తే ఆధ్యాత్మిక జీవశక్తి ప్రాప్తిస్తుంది


Ens Balu
14
Kakinada
2023-02-21 07:05:41

భద్రాచల పాదయాత్రికుల గురు స్వామి ఉంగరాలవీరవెంకట సుబ్బారావు(వాసుదేవఆచార్య)ను కాకినాడ స్వయంభు భోగి విఘ్నేశ్వరస్వామి పీఠంలో గణపతికిధారణ చేసినపూల మాలశేషవస్త్రాలతోవిశేషంగా సత్కరించి ఆధ్యాత్మికగ్రంధాన్ని బహూకరించారు. కాకినాడ, పెద్దాపురంప్రాంతాల హనుమదీక్షా పరులతో 12ఏళ్లుగా ఫిబ్రవరిలో భద్రాచల పాదయాత్ర చేస్తున్నారని పీఠం ఉపాసకులు దూసర్లపూడిరమణరాజుపేర్కొ న్నారు. గురుస్వామిమాట్లాడుతూ పీఠంలో ముహూర్తం చేసి విఘ్నాలు లేకుండా విష్వక్సేనప్రసాదంగా  పాదయాత్ర చేస్తున్నామన్నారు. రు.11లక్షల తోనిర్మించిన శ్రీరామ రథంతో మూడేళ్లుగా300మంది పాల్గొంటున్నారన్నారు. పాదయాత్ర లు మానవజీవితా నికి ఆధ్యాత్మిక జీవశక్తిని సిద్ధిస్తాయన్నారు. భజన సంకీర్తనలో  భక్తులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని రథాన్ని లాగారు.
సిఫార్సు