ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలి
Ens Balu
14
Visakhapatnam
2023-02-21 07:26:04
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మనలో తెలుగుభాష పట్ల గౌరవాన్ని ఇతర భాషలను ఆదరించే ఇంగితాన్ని ఒకభాష మరొక భాషపై పెత్తనం చాలాయించడాన్ని వ్యతిరేకించే స్ఫూర్తిని కలిగించాలని పైడా కృష్ణప్రసాద్, విజెఎఫ్ అధ్యక్షులు,సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, డా.ఎస్. విజయకుమార్ లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదండు ఆధ్వర్యంలో మంగళవారం విశాఖ మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు తల్లికి ఘనంగా నీరాజన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, మాత్రుభాషను ప్రతీ ఒక్కరూ గౌరవించాలన్నారు. అధ్యక్షులు పరవస్తు సూరి మాట్లాడుతూ తెలుగు దండు ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని మాతృభాషను మ్రింగి వేసే మన దేశవాలి పాలకుల మూర్ఖపు చర్యలకు మాత్రమే వ్యతిరేకమన్నారు. మాత్రుభాషలోనే విద్యాబోధన జరగాలన్నారు. ఫ్రొ.సూరప్పడు, ఎ.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.