కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ తాటిమానుపాలెం గ్రామంలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన కొర్రు వీర్రాజు, వెంకటేశ్వరరావు, దారమల్లేశ్, పాంగి శ్రీనులకు చెందిన నాలుగు ఇళ్లు ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. బట్టలు, బంగారం, వంట సామాగ్రి, అన్ని కాలిపోయా బాధితులు నిరాశ్రయులయ్యారు. ఈ ప్రమాదంతో సుమారు రూ.13 లక్షలు వరకూ ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు. సంఘటన జరిగిన వెంటనే గ్రామ సర్పంచి చందు, కార్యదర్శి నాగమణి, డీఏ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆ ప్రదేశాన్ని సందర్శించారు. జరిగిన అగ్నిప్రమాదంపై మండల అధికారులకు తక్షణ సమాచారం అందించారు.