కొయ్యూరు మండలం తాటిమానుపాకల గ్రామంలో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన 7 కుటుంబాలకు చెందిన బాధితులుకు దుమంతి సత్యన్నారాయణ తనవంతు సహాయం అందజేశారు. ఈ మేరకు గురువారం గ్రామంలో బాధితులకు 150 జతల బట్టలు, నిత్యవసర సరుకులు, ప్లాస్టిక్ బకెట్లు పంపిణీ చేసి తన దాద్రుత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్నిప్రమాదంలో ఇళ్లుకోల్పోయిన వారు అదైర్య పడవద్దన్నారు. విషయం ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేయడంతో తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సహాయ కార్యక్రమానికి చేయూతనిచ్చిన తన స్నేహితులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ సుర్ల చందర్రావు, సుకంకరి బాలేసు, దుమంతి రామక్రిష్ణ, కిరణ్, దుంప సతీష్ తదితరులు పాల్గొన్నొరు.