ప్రధాని పాలనలో సుభిక్షంగా దూసుకుపోతున్న దేశం


Ens Balu
7
Visakhapatnam
2023-06-16 16:20:07

ప్రధాని నరేంద్రమోడీ పాలనలో దేశం సుభిక్షంగా శరవేగంగా దూసుకుపోతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి  అన్నారు. శుక్రవారం విశాఖ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ఆయన మాట్లాడారు. దేశంలో 12 కోట్ల మందికి తాగు నీటి సదుపాయం కల్పించారని చెప్పారు. పీఎం మోడీ వల్లనే జీడీపీ వృద్ధి రేట్ గణనీయంగా పెరిగి ప్రతీ రోజూ 37 కిలో మీటర్లు  రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ కారణంగా పెట్రోల్ ఆదా పెరిగిందని వివరించారు. భారతీయ రైల్వేకి గతంలో ఎన్నడూ లేనంత బడ్జెట్ కేటాయించారని తెలిపారు. రూ.10లక్షల కోట్లు బడ్జెట్ రైల్వే కి ఇచ్చారని ఇంత భారీ మొత్తం బడ్జెట్ గతంలో ఎన్నడూ లేదన్నారు. విదేశీ మారక ద్రవ్యం కూడా భారీ ఎత్తున ఆర్జించారని గుర్తు చేశారు. పీఎం అవాస్ యోజన లో భాగంగా 3.5 కోట్ల ఇళ్లను గత 9ఏళ్ళ లో కట్టించారని చెప్పారు. రైతులకు ఫర్టిలైజర్ సబ్సిడీ తో ప్రోత్సహిస్తున్నారని, మంచిగా పాలన అందిస్తూన్న మోడీని అంతా ఆదర్శం గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే డిజిటలైజేషన్  ద్వారా మనం మరింత పురోగతి సాధించామని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.