గిరి ప్రదక్షిణలో భక్తులకు ఆర్యవైశ్యుల ఫలహార వితరణ..


Ens Balu
37
Visakhapatnam
2023-07-03 06:31:09

సింహాచలం వరాహ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖపట్నం ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో సీతమ్మధార మెయిన్ రోడ్ హెచ్. బి.కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద గల బాలాజీ ఫంక్షన్ హాల్ ఎదురుగా భక్తులకు ఇడ్లీ, టమాటా బాత్, తీపి బూంది పలహారాలను అందించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి నిర్విరామంగా అందజేశారు. గిరి ప్రదక్షిణ చేస్తున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఈ శిబిరంలో సేవ చేస్తున్న ఆర్యవైశ్య సంఘం సభ్యులను గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు బలవర్ధకమైన ఫలహారం అందిస్తున్నందుకు అభినందించి కొంతసేపు భక్తులకు ఫలహార పంపిణీ చేసారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు నల్లూరి నూకరాజు. కార్యదర్శి పూసర్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతిఏటా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా గిరి ప్రదక్షిణ భక్తులకు ఫలహారం పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.  కార్యక్రమ చైర్మన్ పూసర్ల సుధీర్ మాట్లాడుతూ, సంఘం సభ్యులు స్వచ్ఛంద విరాళ రూపంలో అందించిన పచారీ సరుకులు, నగదు  మొత్తంతో భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు విరించారు. అంతకుముందు ఈ పలహార వితర కార్యక్రమాన్ని ప్రముఖ న్యాయవాదులు ఎం.కే. శ్రీనివాస్, ఎం.ఎస్. వెంకటేష్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి గ్రంధి దుర్గాప్రసాద్, కన్యకాపరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు ఆరిశెట్టి దినకర్, ఇసుక కొండ సత్యనారాయణ స్వామి దేవస్థానం మాజీ అధ్యక్షుడు విన్నకోట రామమూర్తి, సభ్యులు దుర్గా సోమేశ్వరరావు వెదుళ్ళపల్లి శ్రీనివాసరావు, సుగ్గు శివకుమార్, కె.వి. రమణయ్య, పూసర్ల సంజీవరావు, కంకటాల సతీష్, తదితరులు పాల్గొన్నారు.