డుంబ్రిగుడలో ఘనంగా ఆదివాసి దినోత్సవం


Ens Balu
31
Dumbriguda
2023-08-09 14:57:12

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని డుంబ్రిగుడ మండల కేంద్రంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మండల కేంద్రంలోని జంక్షన్ వరకు  గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించి మనోహరం చేపట్టారు. అనంతరం గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ బి పోతురాజు, టి.సూర్యనారాయణ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం  వచ్చి దశబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ అనేక గిరిజన గ్రామాల్లో రోడ్లు, వంతెనలు తాగునీరు, విద్యా వైద్యం వంటి సౌకర్యాలు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజ్యాంగంలో కల్పించిన గిరిజన చట్టాలను అమలు చేయకుండా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఖండ్రు మ్ ఎంపీ యూపీ పాఠశాలలో కూడా విద్యార్థులు ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కే.సంజీవరావు, యుటిఎఫ్ మండల అధ్యక్షుడు ఎస్ బాలకృష్ణ, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.