విశాఖజిల్లాలో వారాహి యాత్రను విజయవంతం చేయండి


Ens Balu
40
Anakapalle
2023-08-09 15:29:28

విశాఖ ఉమ్మడి జిల్లాలో ఈనెల 10 నుంచి 19 వరకు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్రను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని  నియో జకవర్గ జనసేన ఇంచార్జి పరుచూరి భాస్కరరావు పిలుపునిచ్చారు. బుధవారం అనకాపల్లి బైపాస్ రోడ్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్ కు 11 గంటలకు విచ్చేసి, అక్కడి నుండి దసపల్లా హోటల్ కు చేరుకుంటారని చెప్పారు. పార్టీ నాయ కులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు. 19వ తేదీ వరకు పవన్ కళ్యాణ్  విశాఖ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు.అలాగే జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనకాపల్లి ఎప్పుడు వస్తారనేది త్వరలో తేదీ ఖరారు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రం ప్రగతి బాటన నడవాలంటే జనసేన అధికా రంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అంశాన్నిఅందరూ గుర్తించాలన్నారు.