దళితవాడల అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం


Ens Balu
29
Anakapalle
2023-08-09 16:19:05

దళిత వాడలు అభివృద్ధి చెందాలంటే అంది చంద్రబాబుతోనే సాధ్యమని అనకాపల్లి టిడిపి ఇన్చార్జి పీలా గోవింద సత్యన్నారాయణ పేర్కొన్నారు. బుధవారం ఎఎంసి కాలనీలో 83వ వార్డు ఇంచార్జీ బొద్దపు ప్రసాద్, అర్బన్ జిల్లా కార్యదర్శి శంకర్ల పద్మలత ల ఆధ్వర్యంలో మహాశక్తి పథకం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాజీ ఎమ్మెల్యే పీలా మాట్లాడుతూ, ఏపీకి త్వరలోనే మంచిరోజులు రానున్నాయన్నారు. తెలుగు మహిళలు తో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణి చేశారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ , టీడీపి వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు  విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు,పార్టీ నాయకులు పోలవరపు త్రినాథ్, అధికసంఖ్యలో కార్యకర్తలు ,అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.