బెస్ట్ సర్వేయర్ గా వీర్ల.సురేష్


Ens Balu
62
కాకినాడ
2023-08-15 07:34:20

 కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం సచివాలయంం-1 సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న వీర్ల.సురేష్  ఉత్తమ సర్వేయర్ గా అవార్డు అందుకున్నాడు. మంగళవారం జిల్లాకేంద్రంలో జరిగిన 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో  వీర్ల.సురేష్ కు ఉత్తమ సర్వేయర్ అవార్డును జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, ఎంపి వంగా గీతా విశ్వనాధ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీదిరి.అప్పలరాజు,జాయింట్ కలెక్టర్ లు సమయుక్తంగా ఉత్తమ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్వేయర్ అవార్డు గ్రహీత వీర్ల.సురేష్ మాట్లాడుతూ, తనకు 2వ సారి ఉత్తమ సర్వేయర్ అవార్డు రావడం తన బాధ్యతను మరింత పెంచిందని.. ఈ అవార్డును తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానని తెలిపారు. సురేష్ కు ఉత్తమ సర్వేయర్ అవార్డు రావడం పట్ల ప్రత్తిపాడు  ఎమ్మెల్యే పర్వత.పూర్నచంద్ర ప్రసాద్, శంఖవరం మండలం సచివాలయ సిబ్బంది..కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి, జూ.సహాయకులు రమణమూర్తి, చిన్నానలు వీర్ల.సురిబాబు,వీర్ల.చక్రరావు,వీర్ల.రాము,స్దానిక గ్రామ సర్పంచి శెట్టిబత్తుల.కుమార్ రాజా,గ్రామస్థులు తదితరులు హర్షం వ్యక్తం చేసారు.