రూ.11.50 కోట్లతో నూకాంబిక ఆలయ ఆధునీకరణ


Ens Balu
75
Anakapalle
2023-08-27 13:48:47

అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం పునః నిర్మాణ 11.50 కోట్ల తో పనులు చేపట్టనున్నట్టు ఆలయ పర్యవేక్షకులు, వైఎస్సీర్పీపీ నాయకులు దాడి జయవీర్ చెప్పారు.  శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం మీడియాలో ఆయన మాట్లాడారు. ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయం లో భవి‌ష్యత్ తరాలు దృష్ట్యా రాతి కట్టడం తో పునః నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. మొదటి దఫా గా రూ.3.05 కోట్ల తో రాతి కట్టడంతో గర్భా లయం, అంతరాలయం, అని వెట్టి మండపం పనులు చేపడగామని, .రెండవ ధపా లో రూ.5 కోట్లతో ప్రాకార మండపం, మిగిలిన అని వెట్టి మండపం పనులు చేపట్టను న్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన మండపం పనులకు శ్రీవాణి ట్రస్ట్ నుంచి రూ.1.50 కోట్లు  టిటిడి మాజీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మంజూరు చేయనున్నా రన్నారు.  రూ.2.50 కోట్ల తో నిర్మించిన తొమ్మిది అంతస్తుల రాజగోపురం ఆలయ పునః నిర్మాణ పనులు పూర్తయ్యాయిన తరువాత వినియోగం లోనికి తీసుకొస్తామ న్నారు. ప్రసాదం పథకం ద్వారా అత్యధిక నిధులు మంజూరు చేసినట్లయితే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నారు. 

దేవస్థానంలో చేపట్టే అభివృద్ధి పనులకు రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులందరూ సహకారించాలని ఆయన కోరారు. ఎపి రాష్ట్ర అర్చక ఎగ్జామ్నర్, వేద పండితులు చక్రవర్తి మాట్లాడుతూ, ఆగమశాస్త్రంకు స్థానిక సాంప్రదాయాలు జోడించి శాస్త్రోక్తంగా అమ్మవారి ఆలయాన్ని పునః నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఆలయ పునః నిర్మాణ పనులు చేపట్టేందుకు ముందు బాల లయం ఏర్పాటు చేసి ఉత్సవ్ మూర్తి దర్శనాలను జరిపించాలన్నారు.  దేవాలయ ఈఓ బండారు ప్రసాద్ మాట్లాడుతూ, వేదపండితుల సలహాలు సూచనలు మేర వచ్చే సెప్టెంబరు 7 వ తేదీ నుంచి దేవాలయ పునః నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా అమ్మవారి మూలవిరాట్ దర్శనాలు నిలిపి వేసి తాత్కాలికంగా దేవస్థాన కళ్యాణ మండపం ప్రాంగణంలో అమ్మవారి బాల లయం వద్ద దర్శనం ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కాగా అమ్మవారి దేవాలయ ఆధునికీకరణ పునః నిర్మాణ పనులకు సహకరించిన రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, వైసీపీ నాయకులు దాడి రత్నాకర్, దాడి జయవీర్ తదితర ప్రజా ప్రతినిధులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు వాసు, వి. మురళీ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.