వడ్లపూడిలో మహా శివలింగ ప్రతిష్టాపన


Ens Balu
40
Gajuwaka
2023-08-27 14:33:42

గాజువాక వడ్లపూడిలో ప్రాచీన ఆలయాలు ఒక్కొక్కటి బయటకు వచ్చి ప్రతిష్టాపన జరగడం శుభ పరిణామమని ఎంపీ జివిఎల్ నర్శింహారావు పేర్కొన్నారు. వడ్లపూడి రైల్వే క్వార్టర్స్ లో ఆదివారం దశాబ్దాల నాటి శివాలయంలో మహా శివలింగం ప్రతిష్టాపన అత్యంత ఘనంగా జరిగింది. శివలింగంతోపాటు వారాహి, పార్వతీదేవి, గణపతి విగ్రహాలతో పాటు కళస ప్రతిష్టాపన అర్చకులు వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ(రాజ్యసభ)జీవీఎల్ నరసింహారావు, మైథిలి దంపతులు గౌరవ అతిదిగా నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు జ్యోతి దంపతులు పూజలో పాల్గొన్నారు. విగ్రహాల ప్రతిష్ట అనంతరం వైదికులు ఎంపీ జీవీఎల్ దంపతులకు వేదాశీర్వాదం చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు.  అర్చకులు సుబ్రహ్మణ్య ఫణిశర్మ పర్యవేక్షణలో పూజలు జరిగాయి.ఈ కార్యక్రమంలో దలాయ్,రమణారావు,అప్పారావు,వెంకటరావు,సాంబమూర్తి,శ్రీరామమూర్తి,కృష్ణంరాజు,రోహిణి,భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.