రాబోయే ఎన్నికల్లో విజయానికి కీలక భూమిక పోషించాలి


Ens Balu
27
Anakapalle
2023-08-27 16:10:30

రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించేలా జిల్లా కార్యవర్గం కీలక భూమిక పోషించాలని ఆ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ సూచించారు. అనకాపల్లి రింగ్ రోడ్డు లోని రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి  గుడివాడ అమర్నాథ్ క్యాంపు కార్యాలయంలో  ఆదివారం నూతన వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈసందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని వారిని చైతన్యవంతం చేయడంలోనూ, ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ కార్యవర్గం చురుకైన పాత్ర పోషించాలన్నారు. 2024లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని స్థాపించి జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు పని చేసిన వారందరికీ మంచి గుర్తింపు లభిస్తుందని ఆయన తెలిపారు. పార్టీ విజయం కోసం శాయశక్తుల శ్రమించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా వైఎస్సీర్సీపి నూతన కార్యవర్గ సభ్యులుపాల్గొన్నారు.