150 మందిపై బైండోవర్ కేసులు ..ఎస్సై రామారావు


ErleSrinu
47
Natavaram
2024-01-13 15:54:58

పండుగలతో పాటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రశాంత వాతావరణం కల్పించడం కోసం 150 మందికి పైగా బైండోవర్ కేసులు నమోదు చేశామని ఎస్సై రామారావు తెలిపారు. మండలంలోని 31 పంచాయతీల్లో వివిధ తగాదాల్లో ఉన్న 150 మందికి పైగా స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో హాజరు పరిచామన్నారు. వీరంతా ఆరు నెలల పాటు నిబంధనలు ఉల్లంఘించి చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే రూ.లక్ష జరిమానాతో పాటు జైలుకు పంపిస్తామన్నారు. నేర చరిత్ర కలిగిన 31 మందిలో ఆరుగురు రౌడీషీటర్లు ఉ న్నారన్నారు. వీరి కదలికకపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.