పారదర్శకంగా కులగణన.. కమిషనర్ నాగ నరసింహారావు


Ens Balu
40
Kakinada
2024-01-18 15:09:33

కుల గణన పై శిక్షణా కార్యక్రమం  కాకినాడ లో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న కులగణన ను పారదర్శకంగా  నిర్వహించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్. నాగ నరసింహారావు ఆదేశించారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో కుల గణన పై సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్ యాప్ లో  కులాన్ని నమోదు చేయాలన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు అందుబాటులో లేని ప్రజల సౌలభ్యం కోసం... ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఆయా సచివాలయాలలో నమోదు చేసుకునే అవకాశం కల్పించామన్నారు.కుల గణన ప్రక్రియకు వాలంటీర్ తో పాటు సచివాలయ కార్యదర్శి కూడా తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు. కులగణన నమోదు అనంతరం ఫిబ్రవరి 5 నుంచి 15వ తేదీ వరకు  పరిశీలనా కారులు వెరిఫికేషన్ చేస్తారన్నారు. ఈ ప్రక్రియ కు  సంబంధించి ప్రజలనుంచి సేకరించాల్సిన సమాచారం, విధివిధానాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో  స్పెషల్ ఆఫీస ర్లు,నోడల్ అధికారులు, అడ్మిన్ సెక్రటరీలు,ఎడ్యుకేషనల్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు హాజరయ్యారు.