రాజకీయ పార్టీలతో సమావేశం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే –2024 కుసంబంధించి ఫారం–6,7,8 ద్వారా ఇప్పటి వరకు 1,13,504 దరఖాస్తులు అందాయని కాకి నాడ సిటీ నియోజకవర్గ ఈఆర్వో, కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు చెప్పారు. గురువారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమా వేశం జరిగింది. సవరణ ప్రక్రియ ప్రగతిని ఆయా పార్టీల ప్రతినిధులకు ఈ ఆర్ ఓ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు లక్షా 436 దరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించామన్నారు. 12,023 దరఖాస్తులను తిరస్కరించామన్నారు. ఇంకా సుమారు వెయ్యి దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పారు. నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు నూతన దరఖాస్తులను కూడా స్వీకరించి పరిష్కరిస్తామన్నారు.ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కమిషనర్ నివృత్తి చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు రావూరి వెంకటేశ్వరరావు(వైఎస్ఆర్సీపీ), తుమ్మల రమేష్ (టిడిపి), అప్పారావు(బిఎస్పి), ఏఈఆర్వోలు జాన్బాబు, వరహాలయ్య, మురళి, సీతాపతిరావు, హరిదాసు, నాగశాస్త్రులు తదితరులు పాల్గొన్నారు.