సోమవారం జీవీఎంసీలో జగనన్నకు చెబుదాం


Ens Balu
36
Visakhapatnam
2024-02-04 14:25:57

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జగనన్నకు  చెబుదాం ( స్పందన) కార్యక్రమం సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించనున్నట్టు జివీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, మొక్కల విభాగం, రెవిన్యూ, యు సి డి, ఇంజనీరింగ్ మొదలైన విభాగాలకు సంబంధించిన సమస్యలను నగర ప్రజలు స్వయంగా ఈ కార్యక్రమం తమ సమస్యలపై అర్జీలు పెట్టుకొని పరిష్కారం పొందాలని తెలియజేశారు.