సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొనఊపిరితో ఉన్న తెలుగుదేశం పార్టీ పతనానికి అనకాపల్లి జిల్లాలోని గొలుగొండ మండలం, సిహెచ్.నాగాపురం గ్రామ పంచా యతీలో ఒక వ్యక్తి ప్రధాన కారణంగా మారుతున్నాడనే ప్రచారం గుప్పుమంటుంది. అంతేకాదు ఆ అంశాన్ని నిజం చేసేలా మారుతున్న ఆయన వ్యవహార సైలి అటు వైఎస్సార్సీపీ మండల నాయకత్వానికి వరంగా మారిందనే ఆరోపణలు లేకపోలేదు. ఎలాగైనా పార్టీని బ్రష్టు పట్టించి, అధికార వైఎస్సార్సీపీ నేతలను రెచ్చగొట్టి సొంతింటి కార్యకర్తలను కూడా అధికార పార్టీలోకి వెళ్లిపోయేలా చేస్తున్న ఆ వ్యక్తి అరాచకాలు ఇపుడు మండల పార్టీ,జిల్లా పార్టీలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఎలాగైనా చే జారిపోయిన్న కార్యకర్తలు, పార్టీ అభిమానులను ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఓటర్లను కూడగట్టుకునే పనిచేస్తున్న తరుణంతో ఆవ్యక్తి వ్యక్తిగత స్వలాభం, ఫాల్స్ ఫ్రెస్టేజీతో గ్రామ పంచాయతీలోని అన్ని విషయాల్లోనూ వేలు పెడుతుండటంతో కొద్దో గొప్పో ఓట్లు పడతాయనుకున్న పంచాయతీలో పూర్తిగా పార్టీ చతికబడి స్థితికి చేరుకుందనే వాదన బలంగా వినిపిస్తున్నది.
ఇప్పటికే సదరు వ్యక్తిపై మండల నాయకత్వం ఫిర్యాదుచేసినప్పటికీ పట్టించుకోకపోవడం, అటు జిల్లా నాయకత్వం చర్యలు తీసుకోకపోవడంతో సదరు వ్యక్తి పంచాయతీలో చేస్తున్న స్వలాభపనులకు పార్టీగ్రామస్థాయి కార్యకర్తలు కూడా దూరమయ్యే పరిస్థితి దాపురించింది. గత కొద్ది రోజుల నుంచి గ్రామపంచాయతీలో పూర్తిగా పార్టీని బ్రష్టు పట్టించి, ఎవరూ పార్టీలో ఉండకుండా చేయడంలో సదరు వ్యక్తి యొక్క వ్యక్తిగత పనులకు పార్టీని దారు ణంగా వాడుకోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ఈకారణంతోనే మొన్న కదలిరా టిడిపి మాడుగుల మండలంలోని మహాసభకు సైతం కార్యకర్తలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అంతకు కొద్ది రోజుల ముందు నిర్వహించిన సిద్దం వైఎస్సార్సీపి సభకు టిడిపి కార్యకర్తలు సైతం అధికార వైఎస్సార్సీపీ పార్టీతో తెలియకుండా కలిసి వెళ్లారనే ఆరోపణలు కూడా బగ్గుమంటున్నాయి. పేరుకి చిన్నగ్రామ పంచాయతీ అయినప్పటికీ సదరువ్యక్తి చేసే పనులకు, తేడా రాజకీయాలకు మండల పార్టీ నాయకులు, జిల్లా నాయకులకు సైతం ఫిర్యాదులు వెల్లువత్తే పరిస్థితి వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఉన్న ఆ కాస్త ఓట్లు, కార్యకర్తలు కూడా చేజారిపోయే పరిస్థితి లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి ఇప్పటికైనా పార్టీకి నష్టం చేకూర్చే వ్యక్తి విషయంలో మండల, జిల్లా పార్టీ దృష్టిసారిస్తుందా లేదంటే ఆయన వ్యక్తగత పనుల కోసం పార్టీని వినియోగించుకుంటున్నా పర్వాలేదనుకొని ఊరుకుండిపోతుందా అని..!