అన్నవరం వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకి ఈఓ కె.రామచంద్రమోహన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అంతరాలయంలో స్వా మి వారికి పూజలు అనంతరం స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ, రాష్ట్ర శుభిక్షింగా ఉండాలని స్వామిని వేడుకున్నట్టుచెప్పారు. ప్రజలకు స్వర్ణయుగ పరిపాలన అందుబాటులోకి వచ్చిందని.. ప్రజల కష్టాలు తీరనున్నాయని అన్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది. కూటమి నాయకులు పాల్గొన్నారు.