త్యాగధనుల బలిదానంతో భారతదేశానికి స్వాతంత్ర్య సిద్ధించిందని.. ఆ మహనీయుల ఆశయాలను కొనసాగించాలని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత, సకల కళాకారులు సంఘం అధ్యక్షులు, ప్రముఖ సంఘ సంస్కర్త, టిడిపి నాయకులు డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. గురువారం ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆరిలోవ ప్రాంతంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో మువ్వన్నెల జెండాను ఎగుర వేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చేపట్టారు. విష్ణు స్కూల్స్(మధువాడ), చినగదిలి శ్రీక్రిష్ణ యాదవ యువజన సేవా సంఘం, శివాజీనగర్ సేవా సంఘం, నర్సరీ గార్డెన్స్ 40ఫీట్ బ్లాక్స్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగుర వేశారు. పెద్ద ఎత్తున సేవాల కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన స్వాతంత్ర్య ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామన్నారు.
ఆ త్యాగధనుల పోరాటాలను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎదుటివారికి సహాయం చేయడం, తమవంతు బాధ్యతగా బావించాలన్నారు. దేశనాయకుల స్పూర్తినే తమ పిల్లల పేరున ఉపకార్ ఛారిటబుల్ ట్రస్తు ఏర్పాటు చేసి ప్రజలకు సేవచేస్తున్నామని అన్నారు. ప్రపంచ దేశాల్లో మన దేశం ప్రగతిపదాన సాగడం అభినందనీయమన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం పండుగ సంతోషంతో పాటు బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు. విద్యార్థుల మంచి చదువుకునే దశనుంచే సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మంచి చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ ప్రాంతంలోని ప్రధాన సమస్యలను తన పరిధిలో పరిష్కరిస్తూ , పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని, వాటిని రానున్న రోజుల్లో మరింతగా పెంచుతామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. అనంతరం 300 అడుగుల జెండా ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దేశనాయకులు వేషదారణలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వికలాంగులకు, పిల్లలకు మిఠాయిలు పంపిణి చేశారు.స్కిల్ డెవలెప్ మెంట్ కార్యాలయం వద్ద 300 అడుగుల జాతీయజెండా పదర్శన, భారీ ర్యాలీగా అక్కడి నుంచి పినాకిల్ ఆసుపత్రి గ్రౌండ్ కి చేరుకున్నారు. ఇక్కడే జనసేన మెగా క్రికెట్ టోర్నమెంటులో గెలిచిన వారికి రూ.లక్ష స్పాన్సర్ షిప్ అమౌంట్ బహూకరించారు. విశాఖ తూర్పులో నియోజకవర్గంలో కూచిపూడి కళాకారులకు సన్మానం, స్పాన్సర్ షిప్.. కూచిపూడి కాంపిటిషన్స్ లో పాల్గొన్నవారికి బహుమతు ప్రధానం చేశారు. ఆరిలోవ లో రాఖీ బాక్సింగ్ క్లబ్ నిర్వాహకులకు కిట్ బ్యాగులు, గ్లౌజ్ సెట్ల బహుకరించారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా.. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎల్లాజీలతో కలిసి డా.కంచర్ల అచ్యుతరావు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు సుధీర్, నాగు, పెద్ద ఎత్తున స్థానికులు, చిరంజీవి అభిమానులు, ఆరిలోవ ప్రాంతవాసులు, ట్రస్టు ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.