రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అగ్రిగోల్డ్ భాదితుల సమస్య


Ens Balu
27
visakhapatnam
2024-08-16 18:59:39

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, సకల కళాకారుల సంఘం అధ్యక్షులు, టిడిపి సీనియర్ నాయకులు డా.కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చాలా మంది అగ్రిగోల్డు బాధితులు ఉన్నారని.. వారు కాయ కష్టం చేసుకొని దాచు కున్న డబ్బంతా సంస్థ బోర్డు తిప్పేయడం వలన నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు చాలా చిన్న మోసంగా కనిపించినా వేల కోట్ల రూపాయల అవినీతి ఈ సంస్థ ద్వారా జరిగిందన్నారు. చిన్న చిన్న వ్యక్తుల ద్వారా కట్టించుకున్న రూ.పదివేల ఖాతాలు, రూ.15వేల ఖాతాలు, రూ.50వేల ఖాతాలు లక్షల్లో ఉన్నాయని అన్నారు. అవి కాకుండా డైలీ పద్దుల రూపంలో కట్టించుకున్న ఖాతాల సంఖ్య అసలు లెక్కలోనే లేదన్నారు. ఇలాంటి చిన్న చిన్న ఖాతాల ద్వారా సంస్థలోని బడా బడా పారిశ్రామిక వేత్తలు కోట్లలో లాభ పడ్డారన్నారు. బయటకు చిన్నఖాతాలే కనిపించినా.. వాటన్నింటినీ లెక్కేస్తే వేల కోట్లు మొత్తం తేలుతుందన్నారు.

 అలా నిరుపేద ప్రజలను మోసం చేసి బోర్డు తిప్పేసిన అగ్రీగోల్డ్ సంస్థ బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని చెప్పారు. సంస్థ పేరుతో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయన్నారు. వాటిని తనఖా పెట్టినా.. లేదా అమ్మేసినా భాధితుల అప్పులు తీర్చవచ్చునన్నారు. బాధి తులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొందరికే న్యాయం చేశారన్నారు. ఇంకా చిన్న చిన్న ఖాతాల్లో ఉండిపోయిన మొత్తం చెల్లింపులు జరగ లేదన్నారు. విడతలవారీగా బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఎక్కువశాతం సంస్థ మోసం వలన నష్టపోయిన వారికి ఎక్కడా న్యాయం చేయలేదన్నారు. తక్షణమే అగ్రిగోల్డులో పెట్టుబడి పెట్టినవారు, చిట్టీలు కట్టినవారు, ఖాతాల్లో డబ్బు దాచుకు న్నవా రందరికీ కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఎన్నికల్లో బాధితులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంలు హామీ ఇచ్చారని. వాటిని అమలు చేస్తే ఎందరో నిరుపేదలకు న్యాయం చేసిన వారు అవుతారన్నారు. బాధితులకు అండగా తాను ఉద్యమించి. నష్టపోయిన వారి వివరాలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళతానని అన్నారు. 

ఖాతాల్లో డబ్బులు దాచుకున్నవారు, అవి తిరిగి రాకుండా ఉండిపోయిన వారి వివరాలను చాలా వరకూ పోయినట్టు గత ప్రభుత్వం చెప్పడం వెనుక ఏదో మోసం దాగిఉందని కంచర్ల పేర్కొన్నారు. కాగా అగ్రీగోల్డుపై పోలీసులు కేసులు నమోదు అయినా.. ప్రభుత్వం చర్యలు తీసుకుం టామని హెచ్చరించా.. సంస్థలు కట్టించుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడాన్ని ఆసరాగా తీసుకొని.. మరికొన్ని సంస్థలు బోర్డులు తిప్పేయ డానికి కూడా సిద్దంగా ఉన్నాయని.. ఇప్పటికే కట్టినడబ్బులు ఇవ్వమని అడిగితే కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి బాధితులందరికీ న్యాయం జరిగే వరకూ తాను గట్టిగా నిలబడి పోరాటం చేస్తానని డా.కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు.