విశాఖలో వార్డు సచివాలయ సిబ్బంది రోడ్డెక్కారు. టిడిపికి చెందిన ఒక కార్పోరేటర్ అనుచితంగా చేసిన వ్యాఖ్యలకు నిరసన ఉద్యోగులంతా రోడ్డెక్కారు. జీవిఎంసి ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ప్రజాప్రతినిధులు తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.