ప్రధాని మోడీ అంటే ఢిల్లీ ప్రజలకు తిరుగులేని నమ్మకం - డా.కంచర్ల


Ens Balu
9
visakhapatnam
2025-02-08 16:54:06

ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఢిల్లీ ప్రజలకు తిరుగులేని నమ్మకమనే విషయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే ప్రధాన ఉదాహరణ అని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, టిడిపి నాయకులు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీజేయూ) గౌరవాధ్యక్షలు డా.కంచర్ల అచ్యుత రావు పేర్కొన్నారు. ఢిల్లీలో ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో మిత్రపక్ష బీజేపీ విజ యం ప్రధాని మోడీ  పాలన పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి తిరుగులేని సంకేతమన్నారు. అంతేకాకుండా అవినీతి, కుంభకోణా ల్లో కూరుకుపోయిన ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం ఓటమి చెందడం ఆ పార్టీపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతకు చెంపపెట్టని అభివర్ణించా రు. ఢిల్లీ వాసులు ఆప్ పరిపాలనపై ఎంత విసుగు చెందారో చెప్పడానికి వచ్చిన ఫలితాలేనని చెప్పుకొన్నారు. దానికితోడు ఢిల్లీలో తెలుగు ప్రజ లున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ప్రచారం అద్భుతమైన ఫలితానిచ్చిందనడానికి ఇంతకు మించి ప్రధాన ఉదా హరణ మరొక్కటి ఉండదన్నారు. 2025 కూటటి విజయాల పరంపర డిల్లీ వరకూ పాకిందన్నారు. ఇదే ఊపుతో అన్ని రాష్ట్రాల్లో కూటమి విజ య దుందుబి మోగిస్తుందనే ఆశాభాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిల్లీలో బీజేపీ మిత్రపక్ష విజయం పట్ల డా. కంచర్ల హర్షం వ్యక్తం చేశా రు.