కేంద్ర జలశక్తి మంత్రికి ఘన స్వాగతం..


Ens Balu
2
2020-10-02 20:46:42

తిరుమల శ్రీవారి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం 6.15 గంటలకు   ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర జలశక్తి (జలవనరుల శాఖ) మంత్రి  గజేంద్ర సింఘ్ షెకావత్ గారికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.పి.అనిల్ కుమార్, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి, జెసి  మార్కండేయులు   , తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, డిప్యూటి కమాండెంట్ శుక్లా ,  డ్వామా పిడి చంద్రశేఖర్,  రేణిగుంట తహసిల్దార్ శివ ప్రసాద్, భానుప్రకాష్ రెడ్డి, కోడూరు బాలసుబ్రమణ్యం, పోకల అశోక్ కుమార్, వల్లివేడు రాజా రెడ్డి,  ఎం.శ్రీనివాస్ , డిఎస్పీ చంద్రశేఖర్,  ఎయిర్ పోర్ట్ టర్మీనల్ మేనేజర్ గోపాల్  సెంట్రల్ వాటర్ కమిషన్  అబ్జర్వర్ కుమార్, బిజెపి కార్యకర్తలు,  స్వాగతం పలికిన వారిలో వున్నారు. అనంతరం రోడ్డుమార్గాన తిరుమల బయలు దేరి వెళ్లారు. శనివారం ఉదయం  తిరుమల శ్రీవారి దర్శించుకుని సాయంత్రం  రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగుప్రయాణం కానున్నారు.