రైతు భరోసా నుంచే సేవలన్నీ అందాలి..


Ens Balu
6
Munagapaka
2020-10-07 18:45:47

రైతులకు అన్ని వ్యవసాయ సేవలు రైతు భరోసా కేంద్రాల నుంచే అందాలజి  జిల్లా సంయుక్త కలక్టరు ఎం .వేణుగోపాలరెడ్డి సచివాలయ అధికారులను ఆదేశించారు.  బుధవారం  మునగపాక, అచ్చుతాపురం మండలాలలో జెసి పర్యటించారు.  ఈ పర్యటనలో  భాగంగా మునగపాక మండలం ఒంపోలు గ్రామ సచివాలయం , రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసారు. రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న సేవలను గూర్చి రైతులతో మాట్లాడారు.  విత్తనాలు, ఎరువులు, మందులు సక్రమంగా అందుతున్నది, లేనిది అడిగి తెలుసుకున్నారు.  గ్రామ సచివాలయంలో  మౌళిక సదుపాయాలు, రికార్డుల నిర్వహణ  తనిఖీ చేసారు.  సచివాలయం ద్వారా అందించే సేవలలో  లోపాలు లేకుండా చూడాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు.  సచివాలయంలో అందించే  సేవలకు సంబంధించిన సమాచారం బోర్డులపై ప్రదర్శించాలని  సచివాలయ ఉద్యోగులకు తెలిపారు. రైతు సేవల విఫలంపై ఏ ఒక్క ఫిర్యాదు అందినా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జెసి హెచ్చరించారు..