వరదనీటికి కొట్టుకుపోయిన కాజ్ వే


Ens Balu
2
Chodavaram
2020-10-15 12:20:04

చోడవరం మండలం గవరవరం గ్రామం వద్ద శారదా నదిపై తాత్కాలికంగా నిర్మించిన కాజువే గురువారం కొట్టుకుపోవడంతో చుట్టు ప్రక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు శారదా నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కాజువే కొట్టుకుపోయింది. ఇక్కడ శారదా నదిపై వంతెన నిర్మాణం కోసం తాత్కాలికంగా కాజువేను నిర్మించారు. వంతెన నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో పలు గ్రామాల ప్రజలు కాజువేపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇపుడు దానిపై నుంచి వరద నీరు ఉద్రుతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఆయా గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల పై వరదనీరు పారుతున్నది. అధికారులు ఇక్కడి పరిస్థితిని జిల్లా కలెక్టర్ కు నివేదించారు. వర్షాలు తగ్గితే తప్పా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదు.