2 రోజుల్లో రొయ్యల చెరువు సమస్య పరిష్కరిస్తా..


Ens Balu
1
Bangarammapalem
2020-10-16 15:13:13

రేవుపోలవరంలో రొయ్యల చెరువుల ద్వారా వచ్చే ఇబ్బందులపై త్వరలోనే చర్యలు తీసుకొని సమస్య పరిష్కరిస్తామని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు రేపుపోలవరం, బంగారమ్మపాలెం, చిన ఉప్పలం గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఈ గ్రామాల్లో వరదల తాకిడికి నష్టపోయిన ప్రాంతాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేద్రుష్టికి తెచ్చారు స్థానికులు. ఈ ప్రాంతంలో పంట నష్టాలను రెండు రోజుల్లో తయారు చేసి సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొబ్బతోటలు, ప్రత్తిచేలను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులను జరిగిన నష్టం ఎక్కడా ఎలాంటి తేడాలు లేకుండా జరపాలని అధికారులను ఆదేశించారు. వరదనీరు గ్రామాల్లోకి వెళ్లకుండా కాలువల ద్వారా మళ్లించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో నీరు చేరిన చోట వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ చల్లించాలని సచివాలయ అధికారులను రంగంలోకి దించాలని అధికారులకు సూచించారు.