లంకెలపాలెంలో సమస్యలు పరిష్కరించండి..
Ens Balu
11
Paravada
2020-10-22 15:48:53
విశాఖజిల్లాలోని లంకెలపాలెం లో దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ మాధవ్ ను పరవాడ మండల బిజెపి అధ్యక్షులు గనిరెడ్డి రమణ కోరారు. గురువారం స్థానిక శ్రీ రంగనగర్ కాలనీ వాసులతో మద్దిలపాలెం లోని ఎమ్మెల్సీ మాధవ్ స్వగృహంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లంకెలపాలెం లో ప్రధాన సమస్యలైన రైల్వే అండర్ బ్రిడ్జ్, స్థానికంగా ఉన్న టోల్గేట్ సమస్య, మంచినీటి కుళాయిలు సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపాలని మాధవ్ ను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ స్పందిస్తూ, ప్రభుత్వం ద్రుష్టికి సమస్యలు తీసుకెళతానని, కేంద్రం చేపట్టే పనులు కేంద్రం ద్రుష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూరపనేని శ్రీనివాసరావు గురుపూటిదేవుడు, బోండా నర్సింగరావు, దాసరి లక్ష్మణ రావు బోండా రమణ తదితరులు పాల్గొన్నారు.