బీజేపీ తీర్ధం పుచ్చుకున్న తూటిపాల యువత..
Ens Balu
10
Makavarapalem
2020-11-01 16:45:18
భారతీయ జనతాపార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం నచ్చి వివిధ పార్టీలకు చెందిన వారు బీజేపిలోకి వస్తున్నారని బీజేపి నాయకులు గవిరెడ్డి రఘు సత్య సింహా చక్రవర్తి అన్నారు. ఆదివారం విశాఖజిల్లా, మాకవరపాలెం మండలంలో తూటి పాల గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన మద్దతుదారులు చిత్రాడ శ్రీను, పైల రవి, రొంగల గణేష్, కిలపర్తి శివ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈసందర్భంగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ చక్రవర్తి కండువాలు కప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో యువత బీజేపి వైపు ఆకర్షితులు అవుతున్నారనడానికి ఈ చేరికలే సాక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మిరపల పద్మ, మండల ఉపాధ్యక్షుడు కుల్లయ్య, మండల కార్యదర్శి మర్రి నాయుడు, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చింతపల్లి పెంటయ్య, పాపయ్యపాలెం బూత్ కమిటీ అధ్యక్షులు ఎర్రా రామకృష్ణ, కామిరెడ్డి ప్రసాదు, కొల్లు రమేష్ బాబు, వజ్ర గడ బూత్ కమిటీ అధ్యక్షులు తమరాన అప్పలనాయుడు, బొడ్డు రామారావు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.